నేడు ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-05-18T05:27:43+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేస్తామని మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ సోమవారం తెలిపారు.
ఆదోని టౌన్, మే 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేస్తామని మున్సిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ సోమవారం తెలిపారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్ కార్డుతో పాటు, సంబంధిత శాఖలో పని చేస్తున్నట్లు ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. 18వ తేదీ ఒక్క రోజు మాత్రమే వ్యాక్సిన్ వేస్తామని, నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు.