నేడు ఎన్టీఆర్‌ వర్ధంతి

ABN , First Publish Date - 2021-01-18T09:12:35+05:30 IST

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని సోమవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నారు.

నేడు ఎన్టీఆర్‌ వర్ధంతి

నియోజకవర్గాల్లో అన్నదాన, రక్తదాన శిబిరాలు: టీడీపీ

అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని సోమవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎన్టీఆర్‌కు నివాళులర్పించడంతోపాటు అన్నదాన, రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ మీ డియా కోఆర్డినేటర్‌ దారపనేని నరేంద్రబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-01-18T09:12:35+05:30 IST