నేడే పంద్రాగస్ట్‌ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-15T06:12:24+05:30 IST

75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా పరేడ్‌ మైదానంలో సోమవారం ఘనంగా నిర్వ హించనున్నారు. ఈ మేరకు పరేడ్‌ మైదానంలో రంగు రంగు ల ముగ్గులు, జెండాలతో ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ వేడుకలకు గాను ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌ గంప్ప గోవర్ధన్‌ హాజరుకానున్నారు.

నేడే పంద్రాగస్ట్‌ వేడుకలు
పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ


పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లు పూర్తి 

ముఖ్య అతిథిగా విప్‌ గంప 

ఆదిలాబాద్‌ టౌన్‌, ఆగస్టు 14: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా పరేడ్‌ మైదానంలో సోమవారం ఘనంగా నిర్వ హించనున్నారు. ఈ మేరకు పరేడ్‌ మైదానంలో రంగు రంగు ల ముగ్గులు, జెండాలతో ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ వేడుకలకు గాను ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్‌ గంప్ప గోవర్ధన్‌ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పరేడ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా చేసిన వేడుకలను జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డిలు పరిశీలించారు. ఆదివారం పరేడ్‌ మైదానాన్ని సందర్శించిన కలెక్టర్‌, ఎస్పీలు వేడుకలకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడ కుండా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధకా రులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, ముఖ్య అతిథులతో పాటు విద్యార్థులు ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయా లని వైద్యం, మంచినీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ నటరాజన్‌, తహసీల్దార్‌లు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T06:12:24+05:30 IST