ఎంసెట్ ఆప్షన్ల ఎంపికకు ఆఖరు తేదీ నేడే
ABN , First Publish Date - 2020-10-22T07:56:33+05:30 IST
ఎంసెట్ ఆప్షన్ల ఎంపికకు ఆఖరు తేదీ నేడే
తొలి విడత ఎంసెట్ కౌన్సెలింగ్ చివరి దశకు చేరుకుంది. ఆప్షన్ల ఎంపికకు గురువారం ఆఖరు తేదీ. ఈ నెల 20వ తేదీతో ముగిసిన ధ్రువపత్రాల పరిశీలనలో 55,744 మంది పాల్గొన్నారు.
బుధవారం వరకు 49,770 మంది పాస్వర్డ్ జనరేట్ చేసుకోగా.. 43,104 మంది ఆప్షన్లు ఇచ్చారు.