నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-06-15T06:50:44+05:30 IST

నకిరేకల్‌, కేతేపల్లి లో మంత్రి కేటీఆర్‌ మంగళవారం పర్యటించనున్నారు. తొలుత రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ స్వగ్రామం కేతేపల్లి మండలంలోని భీమారంలో రూ.12లక్ష ల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం, రూ.22లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక, రూ.44లక్షల వ్యయంతో నిర్మించిన జడ్పీ పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు.

నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన

నకిరేకల్‌, కేతేపల్లి, జూన్‌ 14: నకిరేకల్‌, కేతేపల్లి లో మంత్రి కేటీఆర్‌ మంగళవారం పర్యటించనున్నారు. తొలుత రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ స్వగ్రామం కేతేపల్లి మండలంలోని భీమారంలో రూ.12లక్ష ల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం, రూ.22లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక, రూ.44లక్షల వ్యయంతో నిర్మించిన జడ్పీ పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నకిరేకల్‌కు చేరుకొ ని రైతువేదిక, వైకుంఠధామాన్ని ప్రారంభించి, 100పడకల ఆస్పత్రి, కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఆయతోపాటు మంత్రి జగదీష్‌రెడ్డి రానున్నారు.

Updated Date - 2021-06-15T06:50:44+05:30 IST