నేడు 62800 డోసుల వ్యాక్సిన్ రాక
ABN , First Publish Date - 2021-04-18T07:14:17+05:30 IST
జిల్లాకు ప్రభుత్వం 62800 డోసుల కొవిడ్ వ్యాక్సిన్ కేటాయించింది.
చిత్తూరు రూరల్, ఏప్రిల్ 17: జిల్లాకు ప్రభుత్వం 62800 డోసుల కొవిడ్ వ్యాక్సిన్ కేటాయించింది. ఇందులో 54800 కోవిషీల్డు.. 8 వేల డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉంది. ఇతర జిల్లాలకన్నా రోజువారీ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో వ్యాక్సిన్ కేటాయింపులో జిల్లాకు ప్రాధాన్యమిచ్చింది. ఆదివారంకల్లా వ్యాక్సిన్లు జిల్లాకు చేరుకుంటాయని డీఎంహెచ్వో పెంచలయ్య తెలిపారు. సోమవారం నుంచి వీటిని వేస్తామన్నారు. కోవిషీల్డ్ డోసులు మాత్రం ఇంతకు ముందు వేసుకున్న, వేసుకోవాల్సిన హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లైన పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో పని పనిచేసే వారికే వేస్తామన్నారు. కోవాగ్జిన్ను రెండో డోసు వారికే ఇస్తామన్నారు.