నేడు మారెళ్ళలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2022-01-18T05:38:48+05:30 IST

మండలంలోని మారెళ్ల బస్టాండ్‌ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ మంగళవారం సాయంత్రం జరగనున్నట్టు నిర్వాహకులు, మాజీ ఎంపీటీసీ సుంకర రాఘవరెడ్డి తెలిపారు. ఎన్‌టీఆర్‌ వర్ధంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, అద్దంకి, కొండప, పర్చూరు శాసన సభ్యులు గొట్టిపాటి రవి కుమార్‌, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు.

నేడు మారెళ్ళలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ
ప్రారంభోత్సవానికి ముస్తాబైన మారెళ్లలో స్వర్గీయ ఎన్‌టీఆర్‌ విగ్రహం

హాజరు కానున్న జిల్లా ప్రముఖులు 

ముండ్లమూరు, జనవరి 17 : మండలంలోని మారెళ్ల బస్టాండ్‌ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ మంగళవారం సాయంత్రం జరగనున్నట్టు నిర్వాహకులు, మాజీ ఎంపీటీసీ సుంకర రాఘవరెడ్డి తెలిపారు. ఎన్‌టీఆర్‌ వర్ధంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, అద్దంకి, కొండప, పర్చూరు శాసన సభ్యులు గొట్టిపాటి రవి కుమార్‌, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు.  

Updated Date - 2022-01-18T05:38:48+05:30 IST