నేటి నుంచి రాయితీ విత్తనాల పంపిణీ

ABN , First Publish Date - 2021-05-17T05:46:46+05:30 IST

జిల్లాలో సోమవారం నుంచి వేరుశనగ, ఇతర విత్తనాలను రాయితీపై అందించనున్నారు. గత ఏడాది వరకూ వ్యాపారుల నుంచి వేరుశనగ కొని, రైతులకు అందించేవారు.

నేటి నుంచి రాయితీ విత్తనాల పంపిణీ

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 16: జిల్లాలో సోమవారం నుంచి వేరుశనగ, ఇతర విత్తనాలను రాయితీపై అందించనున్నారు. గత ఏడాది వరకూ వ్యాపారుల నుంచి వేరుశనగ కొని, రైతులకు అందించేవారు. ఈసారి కే-6 రకం కాయలను రైతుల నుంచి సేకరించారు. వాటినే ప్రస్తుతం పంపిణీ చేస్తామని ఏపీ సీడ్స్‌ మేనేజర్‌ శ్రీనివాసులు తెలిపారు. క్వింటం వేరుశనగ ధర సబ్సిడీ పోనూ రూ.5,208 రైతులు చెల్లించాలని అన్నారు. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 3 సంచుల కాయలను అందిస్తారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఆర్‌బీకేల్లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. జిల్లాలో 350 ఆర్‌బీకేల్లో వేరుశనగతోపాటు కంది విత్తనాలు 1400 క్వింటాళ్లు, పెసర 25 క్వింటాళ్లు, మినుములు 350 క్వింటాళ్లు, కొర్ర 125 క్వింటాళ్లు, జిలుగ 6,110 క్వింటాళ్లు, పిల్లిపెసర 513 క్వింటాళ్లు, జనుము 15 క్వింటాళ్లు పంపిణీ చేయనున్నారు.

Updated Date - 2021-05-17T05:46:46+05:30 IST