నేడు రత్నగిరికి మిజోరం గవర్నర్ హరిబాబు రాక
ABN , First Publish Date - 2021-10-24T07:05:50+05:30 IST
సత్యదేవుడి సన్నిధికి ఆదివారం ఉదయం మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు తన కుటుంబ సభ్యులతో విచ్చేయనున్నారు.
అన్నవరం, అక్టోబరు 23 : సత్యదేవుడి సన్నిధికి ఆదివారం ఉదయం మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు తన కుటుంబ సభ్యులతో విచ్చేయనున్నారు. స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఆయన రాక సందర్భంగా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. దేవస్థానం పీఆర్వో కొండలరావు గవర్నర్ రాక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.