మోదీని కలిసి.. గ్రేటర్‌కు ప్యాకేజీ అడగండి: వినోద్‌

ABN , First Publish Date - 2020-11-28T08:41:29+05:30 IST

హైదరాబాద్‌ పర్యటనకు రానున్న ప్రధాని మోదీని కలిసి జీహెచ్‌ఎంసీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని అడగాలని రాష్ట్ర

మోదీని కలిసి.. గ్రేటర్‌కు ప్యాకేజీ అడగండి: వినోద్‌

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పర్యటనకు రానున్న ప్రధాని మోదీని కలిసి జీహెచ్‌ఎంసీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని అడగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు సూచించారు.

శుక్రవారం వినోద్‌ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు విద్వేషాలు సృష్టించే విధంగా మాట్లాడటం సరికాదని, జీహెచ్‌ఎంసీ అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పాలని అన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానిని బీజేపీ నాయకులు కోరాలని పేర్కొన్నారు.


Updated Date - 2020-11-28T08:41:29+05:30 IST