పారా ఒలింపిక్స్ విజేత భవీనాబెన్కు ప్రదాని మోదీ అభినందనలు!
ABN , First Publish Date - 2021-08-29T16:40:52+05:30 IST
పారా ఒలంపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్...
న్యూఢిల్లీ: పారా ఒలంపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ రజతం దక్కించుకున్నారు. టేబుల్ టెన్నిస్లో భారత్ కు మెడల్ సాధించిపెట్టిన తొలి క్రీడాకారిణిగా భవీనాబెన్ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రీడాకారిణి భవీనా బెన్కు అభినందనలు తెలియజేస్తూ... భవీనా బెన్ జీవితం... యువత క్రీడలలోకి వచ్చేందుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.
భవీనా పటేల్ చరిత్ర సృష్టించారు. భారత్కు అత్యంత ప్రతిష్టాత్మక రజత పతకం తీసుకువచ్చారు. ఆమె జీవితం యువతను మార్గదర్శకమని పేర్కొన్నారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కూడా భవీనాకు అభినందనలు తెలియజేశారు. ఆమె విజయం భారత్కు గర్వకారణమన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా భవీనాకు అభినందనలు తెలిపారు.