‘టోక్యో’ హాకీ సారథి మన్ప్రీత్
ABN , First Publish Date - 2021-06-23T09:33:21+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్గా మన్ప్రీత్ సింగ్ నియమితుడయ్యాడు.
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్గా మన్ప్రీత్ సింగ్ నియమితుడయ్యాడు. తొలిసారి జట్టుకు ఇద్దరు వైస్ కెప్టెన్లను ఎంపిక చేశారు. బిరేంద్ర లక్రా, హర్మన్ప్రీత్ సింగ్ ఉప సారథులుగా వ్యవహరించనున్నారు. విశ్వక్రీడలకు 16 మంది సభ్యుల హాకీ జట్టును గతవారమే ప్రకటించారు.