ఒలింపిక్ క్వార్టర్స్ బెర్త్ సాధించిన దీపికా కుమారి
ABN , First Publish Date - 2021-07-30T15:51:55+05:30 IST
భారత్కు చెందిన వరల్డ్ నెంబర్ వన్ ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్స్ ఫైనల్కు చేరింది.
టోక్యో: భారత్కు చెందిన వరల్డ్ నెంబర్ వన్ ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్స్ ఫైనల్కు చేరింది. రష్యాన్ ఒలింపిక్ కమిటీ క్రీడాకారిని పెరోవా సెనియాని 6-5 తేడాతో ఓడించింది. తర్వాత దీపికా దక్షిణ కొరియా ఆర్చర్ ఆన్ సాన్తో తలపడనుంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో విఫలమైన స్టార్ ఆర్చర్ దీపికా కుమారి వ్యక్తిగత ఈవెంట్లో సత్తాచాటుతూ పతకంపై ఆశలు రేపుతోంది. బుధవారం మొదలైన వ్యక్తిగత విభాగంలో దీపిక రెండో రౌండ్లో 6-4తో అమెరికా ఆర్చర్ జెన్నిఫర్ మూసినో ఫెర్నాండెజ్ను ఓడించి ప్రీక్వార్టర్స్ చేరింది. అంతకుముందు తొలిరౌండ్లో దీపిక 6-0తో కర్మ (భూటాన్)ను చిత్తుచేసింది.