Tokyo Olympics: 35 మంది క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2021-08-02T14:36:38+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన 35మంది క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్ అని తేలిందని....

Tokyo Olympics: 35 మంది క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్

టోక్యో (జపాన్): టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన 35మంది క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్ అని తేలిందని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సోమవారం వెల్లడించింది. జులై నెలలో టోక్యో విమానాశ్రయంలో 4,48,815 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 90 మందికి కరోనా సోకిందని తేలింది. కరోనా సోకిన వారిలో 35 మంది క్రీడాకారులున్నారు. జులై 1 నుంచి 31వతేదీ వరకు విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు చేయగా 0.08శాతం మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని టోక్యో ఒలింపిక్స్ కమిటీ సీఈవో తోషిరో ముటో చెప్పారు. ప్రతీరోజూ 30వేల మందికి కరోనా పరీక్షలు చేస్తూ పాజిటివ్ అని తేలిన వారికి సత్వరం క్వారంటైన్ కు తరలించి వైద్యం అందిస్తున్నామని తోషిరో చెప్పారు. కొవిడ్ భద్రతా నిబంధనలు పాటిస్తూ ఒలింపిక్స్ క్రీడలు సురక్షితంగా నిర్వహిస్తున్నామని తోషిరో వివరించారు.


Updated Date - 2021-08-02T14:36:38+05:30 IST