మంత్రిపై అగ్రకులాలు చేస్తున్న కుట్రలు సహించం
ABN , First Publish Date - 2022-01-29T05:20:00+05:30 IST
బహుజన నాయకుడు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్పై అగ్రకులాలు చేస్తున్న కుట్రలను సహించమని దళిత సంఘాల ఐక్య కార్యాచరణ నాయకులు అన్నారు.
పాలమూరు, జనవరి 28 : బహుజన నాయకుడు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్పై అగ్రకులాలు చేస్తున్న కుట్రలను సహించమని దళిత సంఘాల ఐక్య కార్యాచరణ నాయకులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో ఐక్య కార్యాచరణ సమితి నాయకుడు రాయికంటి రాందాసు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పలు వురు నాయకులు మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ను రాజకీయంగా ఎదుర్కోలేక బురదజల్లే ప్రయత్నం చేయ డం సరికాదన్నారు. మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ టాంపరింగ్ చేశారన్నా లీగల్ వివాదాన్ని అడ్డంపెటుకొని ఆధిపత్యం కోసం అగ్రకులాలు చేస్తున్న కుతంత్రమన్నారు. మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధి, బహుజన సంఘ భవ న నిర్మాణాలకు కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రూ.కోట్లల్లో నిధులు తీసుకువచ్చి అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. ఓర్వలేని అగ్రకులాలు శ్రీనివాస్గౌడ్పై వ్యక్తిగత కక్ష పెంచుకొని స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న చౌకబారు పనులు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో సింగి రెడ్డి పరమేశ్వర్, మంత్రి నరసింహా య్య, కె.యాదయ్య, మల్లెపోగు శ్రీనివాసులు, ఎల్.రమేష్, గడ్డమీది గోపాల్, సురేష్, కేశవు లు, బా లరాజు, ఆర్.ముని స్వామి, ధన్వాడ రాములు, రాజశేఖర్, రమేష్, న రేందర్, తి ర్మలయ్య, రాందాసు, మెట్టు అంజమ్మ, బి.శ్రీనివాసులు, బాలనాగయ్య, యా దయ్య, మణ్యం, చెన్నయ్య, సుజాత, బాలరాజు, కృష్ణవేణి పాల్గొన్నారు.