గూడూరు టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌జాం

ABN , First Publish Date - 2020-11-23T06:51:58+05:30 IST

బీబీనగర్‌ మండల పరిధిలోని హైదరాబాద్‌– వరం గల్‌ జాతీయ రహదారిపై గూడూరు టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి ట్రాఫి క్‌జాం అయింది.

గూడూరు టోల్‌ ప్లాజా వద్ద  ట్రాఫిక్‌జాం
గూడూరు టోల్‌ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు

బీబీనగర్‌, నవంబరు 22: బీబీనగర్‌ మండల పరిధిలోని హైదరాబాద్‌– వరం గల్‌ జాతీయ రహదారిపై గూడూరు టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి ట్రాఫి క్‌జాం అయింది.  సెలవురోజుతో పాటు  వివాహలు,  శుభకార్యాలు అధికంగా ఉండటం,  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనాలకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి ఒక్కసారిగా తిరుగుముఖం పట్టారు.  దీంతో గూడూరు టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ  పెరిగింది. టోల్‌ రుసుం వసూళ్లలో జాప్యం జరిగినందున  హైదరాబాద్‌  వైపు వెళ్లేమార్గంలో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Updated Date - 2020-11-23T06:51:58+05:30 IST