టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ED మరో కీలక నిర్ణయం..

ABN , First Publish Date - 2021-08-28T14:40:53+05:30 IST

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని ఈడీ నిర్ణయించింది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ED మరో కీలక నిర్ణయం..

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని ఈడీ నిర్ణయించింది. విదేశాలకు నిధుల తరలింపుపై టాలీవుడ్ తారలను విచారిస్తోంది. ఇప్పటికే డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, కమింగా, విక్టర్‌ల వాగ్మూలాన్ని సేకరించారు. విదేశీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు ఎంత తరలిపోయిందో ఈడీ లెక్కలు తీయనుంది. ఇంటర్ పోల్ సాయంతో వీదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బును గుర్తించనుంది.


12 మంది సినీ తారాల విచారణ అనంతరం మరికొంతమందికి నోటీసులు జారీ చేయనుంది. విదేశాలకు భారీగా డబ్బు చెల్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. గతంలో సిట్ విచారణలో విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు రిపోర్ట్ అందింది. మరికొంత హవాలా మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఈడీ దగ్గర కీలక ఆధారాలున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-08-28T14:40:53+05:30 IST