Sai Dharam కు ప్రమాదం జరగడంతో సినీ పెద్దల కీలక నిర్ణయం!
ABN , First Publish Date - 2021-09-11T19:56:47+05:30 IST
టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్కు స్పోర్ట్స్ బైక్పై నుంచి పడి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే...
హైదరాబాద్ : టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్కు స్పోర్ట్స్ బైక్పై నుంచి పడి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి నుంచి ఈ వ్యవహారం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో సంచలనమైంది. తేజ్కు తీవ్ర గాయాలవ్వడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. యువ హీరోలు స్పోర్ట్స్ బైక్లు, కార్లు వాడకంపై టాలీవుడ్ సినీ పెద్దలు కలత చెందుతున్నారు.
గత అనుభవాలు.. తాజాగా తేజ్కు జరిగిన ప్రమాదం నేపథ్యంలో పెద్దలంతా కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. బైక్ కల్చర్కు వ్యతిరేకంగా సినీపెద్దలు అడుగులు వేస్తున్నారు. అందరూ కలిసి బైక్ కల్చర్కు చెక్ పెట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే ఇందుకు సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కూడా నిశితంగా చర్చించి.. ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సో.. సినీ పెద్దల నిర్ణయంతో కుర్ర హీరోలంతా ఇక బైక్ రేసింగ్కు దూరంగా ఉంటారేమో వేచి చూడాలి. బైక్ రేసింగ్ చేయొద్దని సాయి తేజ్తో పాటు తన కుమారుడికి కూడా పలుమార్లు వార్నింగ్ ఇచ్చినట్లు సీనియర్ నటుడు నరేష్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తుండటం గమనార్హం.