పొలాల వద్దే టమోటాల కొనుగోలు
ABN , First Publish Date - 2021-05-22T05:41:53+05:30 IST
ఇప్పటి వరకు రైతుల పొలాల వద్దే 1000 టన్నుల టమోటాలను కొను గోలు చేసినట్టు ఏపీ మాస్ ప్రాజెక్టు డైరెక్టర్ జగన్ మోహన్రెడ్డి పేర్కొన్నారు.
మదనపల్లె టౌన్, మే 21: ఇప్పటి వరకు రైతుల పొలాల వద్దే 1000 టన్నుల టమోటాలను కొను గోలు చేసినట్టు ఏపీ మాస్ ప్రాజెక్టు డైరెక్టర్ జగన్ మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మా ట్లాడుతూ... రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న ఆదేశాలతో, జిల్లా జేడీ సుధాకర్ సూచ నలతో జిల్లాలోని 10 మండలాల్లో రైతుల వద్ద టమోటాలను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల పొలాల వద్దనే కిలో రూ.3.50 నుంచి రూ.3.80 ధర చెల్లిస్తూ రోజుకు 100 టన్నుల చొప్పున ఇప్పటి వరకు 1000 టన్నుల టమోటా కొనుగోలు చేశా మన్నారు. రైతుల వద్ద టమోటా కొనుగోలు చేసిన మూడో రోజే రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు నగదు చెల్లిస్తామన్నారు. కొనుగోలు చేసిన టమోటాలను చిత్తూరు సమీపంలోని జైన్ ఫార్మ్ ఫ్రెష్ కంపెనీకి తరలిస్తున్నామన్నారు. టమోటాకు గిట్టుబాటు ధరలు రాని తరుణంలో తాము కొను గో లు చేస్తుండడంతో రైతులకు ఊరట నిస్తోందన్నారు.