రేపు.. టీఆర్ఎస్లోకి మోత్కుపల్లి
ABN , First Publish Date - 2021-10-17T09:07:06+05:30 IST
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. టీడీపీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత బీజేపీలో చేరిన మోత్కుపల్లి..
హైదరాబాద్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. టీడీపీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత బీజేపీలో చేరిన మోత్కుపల్లి.. ఆ పార్టీలో తనకు గుర్తింపు లభించట్లేదన్న అసంతృప్తితో ఉన్నారు. దళిత సాధికారతపై సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని బీజేపీ నిర్ణయించినా.. ఆయన ఆ సమావేశానికి వెళ్లారు. తర్వాత బీజేపీకి రాజీనామా చేశారు. ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకానికి మొదటి నుంచీ ఆయన గట్టి మద్దతుదారుగా ఉన్న విషయం తెలిసిందే.