రేపు అన్నవరంలో రాష్ట్ర పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వార్షిక సభ

ABN , First Publish Date - 2021-03-01T05:36:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా మార్చి 2న అన్నవరంలో వార్షిక మహోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు సమాఖ్య గౌరవాధ్యక్షుడు యామిజాల నర్సింహమూర్తి తెలిపారు.

రేపు అన్నవరంలో రాష్ట్ర పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వార్షిక సభ

భీమవరం టౌన్‌, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్‌ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా మార్చి 2న అన్నవరంలో వార్షిక మహోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు  సమాఖ్య గౌరవాధ్యక్షుడు యామిజాల నర్సింహమూర్తి తెలిపారు. ఈ సభకు ఉప సభాపతి కోన రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్లాది విష్ణు, ఆధ్యాత్మికవేత్త మైలవరపు శ్రీనివాసరావు, గౌరవ సలహాదారు  ఈమని రామచంద్ర సోమయాజీ ఘనాపాఠి హాజరవుతారని తెలిపారు.


Updated Date - 2021-03-01T05:36:13+05:30 IST