టీటీలో భారత్కు కఠిన డ్రా
ABN , First Publish Date - 2021-07-22T08:32:07+05:30 IST
ఒలింపిక్స్ టీటీలో భారత ఆటగాళ్లకు కఠిన డ్రా ఎదురయ్యాయి.
టోక్యో: ఒలింపిక్స్ టీటీలో భారత ఆటగాళ్లకు కఠిన డ్రా ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో 62వ ర్యాంకర్ మనికా బాత్రాకు కొంత సులువైన డ్రా లభించినా, తదుపరి రౌండ్లలో ప్రపంచ నెం. 36, 16వ ర్యాంకర్లను ఢీకొనాల్సి ఉంటుంది. పురుషుల సింగిల్స్లో శరత్, సాథియన్కు తొలి రౌండ్లో బై లభించింది. రెండో రౌండ్లో శరత్ గెలిస్తే.. ఆ తర్వాత ఒలింపిక్ చాంపియన్తో తలపడాల్సి ఉంటుంది.