లంబసింగికి పోటెత్తిన పర్యాటకులు

ABN , First Publish Date - 2021-01-17T06:01:08+05:30 IST

పర్యాటక ప్రాంతమైన లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు, వీకెండ్‌ కలిసి రావడంతో శనివారం వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు.

లంబసింగికి పోటెత్తిన పర్యాటకులు
చెరువులవేనంలో సందడి చేస్తున్న పర్యాటకులు


చింతపల్లి, జనవరి 16: పర్యాటక ప్రాంతమైన లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు, వీకెండ్‌ కలిసి రావడంతో శనివారం వేల సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచే లంబసింగి, తాజంగి జలాశయం, రాజుపాకలు పరిసర ప్రాంతాలు పర్యాటకులతో నిండిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు చెరువులవేనం కొండపై జాతర వాతావరణం తలపించింది. పర్యాటకులు భారీ సంఖ్యలో కొండపైకి వచ్చి మంచు మేఘాలను తనివితీరా ఆస్వాదించారు. శీతాకాలం ముగుస్తుండంతో లంబసింగి సందర్శకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నది. 


Updated Date - 2021-01-17T06:01:08+05:30 IST