మోదీకి కేసీఆర్ లొంగిపోయారు: రేవంత్
ABN , First Publish Date - 2021-08-04T02:00:26+05:30 IST
ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకే ప్రధాని మోదీకి కేసీఆర్ లొంగిపోయారని టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకే ప్రధాని మోదీకి కేసీఆర్ లొంగిపోయారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడటంలేదన్నారు. దీంతోనే కేసీఆర్ ఎవరి పక్షమో తేలిపోయిందన్నారు. కేసీఆర్ ఒత్తిడివల్లే పాదయాత్రను బండి సంజయ్ వాయిదా వేసుకున్నారని రేవంత్ పేర్కొన్నారు.