సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ లేఖ
ABN , First Publish Date - 2021-07-10T19:18:37+05:30 IST
స్టాఫ్ నర్సుల అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ రాశారు.
హైదరాబాద్: స్టాఫ్ నర్సుల అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ రాశారు. తొలగించిన స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1600 కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. ప్రగతి భవన్ ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా లేక... కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా అని ప్రశ్నించారు. 1.91 లక్షల ఖాళీలుంటే 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏమిటని నిలదీశారు. ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలని రేవంత్రెడ్డి లేఖలో పేర్కొన్నారు.