రైతు రవి కుటుంబసభ్యులకు Revanth ఫోన్
ABN , First Publish Date - 2021-12-11T19:00:02+05:30 IST
జిల్లాలోని హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్లో ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్ కుటుంబసభ్యులకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు.
మెదక్: జిల్లాలోని హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్లో ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్ కుటుంబసభ్యులకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దు అనడం వల్లే రవికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్కు రవి కుటుంబీకులు తెలిపారు. తండ్రి పెన్షన్ విషయంపై కలెక్టర్తో మాట్లాడుతానని టీపీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.