కాంగ్రెస్ను మోసం చేసినవాడు కసబ్తో సమానం: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-10-08T23:01:29+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు...
కరీంనగర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. హుజురాబాద్ టీఆర్ఎస్ నాయకుడు కౌశిక్రెడ్డిపై రేవంత్రెడ్డి పరోక్షంగా మండిపడ్డారు. టీఆర్ఎస్లోకి పోతే పదవి వస్తుందని అనుకున్నారని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పదవీ రాలే.. పైసలు కూడా రాలేదని రేవంత్రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హరీష్రావు, ఈటల ఇద్దరూ తోడు దొంగలేనని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈటల వందల కోట్లు, కేసీఆర్ వేల కోట్లు సంపాదించారని రేవంత్రెడ్డి ఆరోపించారు.
గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున హుజురాబాద్లో కౌశిక్రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్లో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదేమోనని భావించిన కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరగానే కౌశిక్రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ నామినేట్ చేసారు. అయితే గవర్నర్ అభ్యంతరాల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి పెండింగ్లో ఉంది.