టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలైయ్యాయి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-05T01:22:33+05:30 IST

రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలైయ్యాయంటూ

టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలైయ్యాయి:  రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలైయ్యాయంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. అందులో పార్ట్ 1 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేయడమన్నారు. అలాగే పార్ట్-2  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కస్టడీలోకి తీసుకోవడమని ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమని చూపించుకోవడానికేనా ఇదంతా  అని ఆయన ఆరోపించారు. ఇప్పుడు దీన్ని బహిర్గతం చేశామన్నారు. ఇప్పుడు డ్రామా ఎలా జరుగుతుందో చూద్దామని ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-05T01:22:33+05:30 IST