టెస్ట్ డ్రైవ్ దొంగ దొరికాడు
ABN , First Publish Date - 2020-10-29T08:30:26+05:30 IST
టెస్ట్ డ్రైవ్ పేరిట ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న దొంగను ఎట్టకేలకు వన్టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలివీ..
చిత్తూరు, అక్టోబరు 28: టెస్ట్ డ్రైవ్ పేరిట ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న దొంగను ఎట్టకేలకు వన్టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలివీ.. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు, మురకంబట్టుకు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ ఆన్లైన్ సైట్లో ద్విచక్రవాహనాలను విక్రయానికి ఉంచారు. యాదమరి మండలం సామిరెడ్డిపల్లెకు చెందిన పవన్ కుమార్ వాహనం కావాలంటూ వారం రోజుల్లో ముగ్గురితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆపై టెస్ట్ డ్రైవ్ పేరుతో మూడు వాహనాలతో ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు చిత్తూరు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిఘా వేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నగర ఇరువారం సమీపంలోని బాలాత్రిపురసుందరి ఆలయం వద్ద పవన్ ఉన్నట్లు సమాచారం తెలుసుకుని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని ఎస్ఐ మోహన్కుమార్ తెలిపారు.