14 ఎర్రదుంగల స్వాధీనం

ABN , First Publish Date - 2020-10-29T08:31:37+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న 14 ఎర్రదుంగలు స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలు సీజ్‌ చేసినట్లు అటవీశాఖ పశ్చిమ డీఎ్‌ఫవో శివశంకర్‌ తెలిపారు.

14 ఎర్రదుంగల స్వాధీనం

చిత్తూరు(సెంట్రల్‌), అక్టోబరు 28: అక్రమంగా తరలిస్తున్న 14 ఎర్రదుంగలు స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలు సీజ్‌ చేసినట్లు అటవీశాఖ పశ్చిమ డీఎ్‌ఫవో శివశంకర్‌ తెలిపారు. బుధవారం స్థానిక అటవీ రేంజ్‌ కార్యాలయంలో ఈ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. యాదమరి మండలం డీకేచెరువు మీదుగా ఎర్రచందనం తరలుతోందంటూ అటవీశాఖ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఎఫ్‌ఆర్వో సుభాష్‌, డిప్యూటీ రేంజర్‌ శివరాం, కమ్మపల్లె బీట్‌ ఎఫ్‌బీవో హరిబాబు తదితరులు బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు డీకేచెరువు, డీపీపాళ్యం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో కారు, టెంపోను ఆపగా అందులో ఉన్న డ్రైవర్లు వాహనాలు వదలి పరారయ్యారు. దీంతో అటవీ అధికారులు వాహనాలను పరిశీలించగా 434 కిలోలున్న 14 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. 

Updated Date - 2020-10-29T08:31:37+05:30 IST