'మద్దతు స్థాయి’కి దిగువన... ట్రేడింగ్
ABN , First Publish Date - 2021-02-23T21:43:19+05:30 IST
: భారీగా కొనసాగుతోన్న లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపధ్యంలో కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ట్రేడింగ్ ప్రారంభించాయి.
ముంబై : భారీగా కొనసాగుతోన్న లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపధ్యంలో కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో ఉన్న సెన్సెక్స్ ప్రస్తుతం 187 పాయింట్ల నష్టంతో 50,702 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో 14,936 వద్దకొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 51 వేల దిగువన, నిఫ్టీ 15వేల దిగువకు చేరాయి. అటు డెరివేటివ్ సిరీస్ ముగింపు నేపధ్యంలో సిరీస్ దాదాపు అన్ని రంగాల షేర్ల్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి.