సంప్రదాయబద్ధంగా అప్పన్న నిత్య కల్యాణం
ABN , First Publish Date - 2021-05-17T04:29:42+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి ఆర్జిత నిత్య కల్యాణాన్ని ఆదివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
సింహాచలం, మే 16: వరాహలక్ష్మీనృసింహస్వామి ఆర్జిత నిత్య కల్యాణాన్ని ఆదివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈనెల పది నుంచి తాత్కాలికంగా నిలిపివేసిన నిత్య కల్యాణాన్ని తిరిగి ఆదివారం ఉదయం దేవాలయ పురోహితుడు కరి సీతారామాచార్యులు యథావిధిగా జరిపారు. ఆలయ అధికారులు పరోక్ష విధానంలో ఆన్లైన్లో నగదు చెల్లించిన భక్తుల గోత్ర నామాలతో ఆర్జిత సేవలు జరుపుతామని ప్రకటించినప్పటికీ ఆదివారం నాటి నిత్య కల్యాణానికి ఒక్కరు కూడా సొమ్ము చెల్లించకపోవడంతో ప్రత్యక్షంగా పాల్గొన్న జంట గోత్ర నామాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.