రేపు ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , First Publish Date - 2021-04-13T06:49:15+05:30 IST
అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీన ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీన ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఆ రోజు ట్యాంక్బండ్పైగల అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉదయం 6 నుంచి కార్యక్రమాలు ముగిసే వరకు పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయన్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను ఆయా రూట్లలో దారి మళ్లిస్తారు. అంబేడ్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వారి వాహనాలను బుద్ధభవన్, నిజాం కాలేజీ గ్రౌండ్లో నిలుపుకునేందుకు స్థలాన్ని కేటాయించామన్నారు.