లంబసింగిలో మళ్లీ ట్రాఫిక్ జామ్
ABN , First Publish Date - 2021-01-17T05:50:28+05:30 IST
లంబసింగిలో మళ్లీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో లంబసింగి జంక్షన్(కొర్రుబయలు)లో ఉదయం ట్రాఫిక్ జామ్ అవుతున్నది.
తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
చింతపల్లి, జనవరి 16: లంబసింగిలో మళ్లీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో లంబసింగి జంక్షన్(కొర్రుబయలు)లో ఉదయం ట్రాఫిక్ జామ్ అవుతున్నది. పోలీసులు ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నప్పటికీ లంబసింగి జంక్షన్ నుంచి బురడవీధి వరకు రహదారికి ఇరువైపులా పర్యాటకులు వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. శనివారం ఉదయం లంబసింగి జంక్షన్లో ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఈమార్గంలో ప్రయాణించే పర్యాటకులు లంబసింగి జంక్షన్ వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చింతపల్లి ఎస్ఐ అహ్మద్ అలీ, పోలీసు సిబ్బంది జోక్యం చేసుకుని ట్రాఫిక్ను నియత్రించారు.