HYD : నేడు Charminar దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు
ABN , First Publish Date - 2021-10-17T14:01:01+05:30 IST
సండే ఫన్డే తరహాలో ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న..
హైదరాబాద్ : సండే ఫన్డే తరహాలో ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇవాళ చార్మినార్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిటీ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరిట ఇవాళ చార్మినార్ వద్ద సెలబ్రేషన్స్ జరగనున్నాయి. దీంతో చార్మినార్ వద్ద ట్రాఫిక్, షాపింగ్ లేకుండా సెలబ్రేషన్స్ మాత్రమే జరుపుకునేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సెలెబ్రేషన్స్ జరగనున్నాయి. నాలుగు ప్రదేశాల్లో సందర్శకుల కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఆదివారం ట్రైల్ రన్తో ప్రతివారం చార్మినార్ వద్ద సెలబ్రేషన్స్ కొనసాగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.