ఇంకా మిస్టరీగానే జీడిమెట్ల ఆత్మహత్యలు!
ABN , First Publish Date - 2021-01-14T12:00:42+05:30 IST
ఇంకా మిస్టరీగానే జీడిమెట్ల ఆత్మహత్యలు!
హైదరాబాద్/జీడిమెట్ల : లాల్సాబ్గూడ ఫారెస్ట్లో ఇద్దరు స్నేహితుల ఆత్మహత్య మిస్టరీగా మారింది. వీరి బలవన్మరణానికిగల కారణాలు తెలియరాలేదు. మూడు రోజుల క్రితం సాయికుమార్, నరేష్ వికారాబాద్ వెళ్లి వచ్చారు. రెండు రోజుల్లో వీరు ఇద్దరు ప్రేమికులకు పెళ్లిళ్లు చేశారు. వీరి ఆత్మహత్య అనుమానాలకు తావిస్తోంది. నరేష్ గతంలోనే ఆత్మహత్య చేసుకుంటానని తన ఫోన్లో వీడియో చేసి పెట్టుకున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. వారి స్నేహితులు, బంధువులను విచారిస్తున్నారు.