ఖరీదైన కార్లున్న ట్రక్కను ఢీకొట్టిన రైలు!

ABN , First Publish Date - 2021-04-03T23:44:03+05:30 IST

అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో భారీ ప్రమాదం సంభవించింది. ఖరీదైన కార్లను మోసుకెళ్తున్న ఓ ట్రక్‌ను రైలు ఢీ కొట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి

ఖరీదైన కార్లున్న ట్రక్కను ఢీకొట్టిన రైలు!

టెక్సాస్: అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో భారీ ప్రమాదం సంభవించింది. ఖరీదైన కార్లను మోసుకెళ్తున్న ఓ ట్రక్‌ను రైలు ఢీ కొట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఫెర్రారీ స్పైడర్ 488, ఫెర్రారీ ఎస్ఎఫ్90, పోర్షే వంటి లగ్జరీ కార్లను కంటైనర్‌ ద్వారా మోసుకెళ్తున్న ఓ ట్రక్కు.. హ్యూస్టన్ సిటీలోని రైలు పట్టాలపై చిక్కుకుపోయింది. ఈ క్రమంలో గురువారం రోజు ఆ ట్రక్కును.. రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటనలో ఎంత మంది గాయపడ్డారు, ఏ మేరకు నష్టం వాటిల్లిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఈ  దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.


Updated Date - 2021-04-03T23:44:03+05:30 IST