శిక్షణ ఇలాగేనా...!

ABN , First Publish Date - 2021-01-21T05:11:34+05:30 IST

జమ్మలమడుగు ఐసీడీఎస్‌ అధికారులు సమయం పాటించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.

శిక్షణ ఇలాగేనా...!
అధికారులు రాకపోవడంతో జమ్మలమడుగు డివిజన్‌ సభాభవనంలో ఖాళీగా కూర్చున్న అంగన్వాడీ కార్యకర్తలు

వేళకు రాని అధికారులు


జమ్మలమడుగు రూరల్‌, జనవరి 20: జమ్మలమడుగు ఐసీడీఎస్‌ అధికారులు సమయం పాటించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో బుధవారం జమ్మలమడుగు డివిజన్‌ సభాభవనంలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి వుంది. రెండు రోజుల నుంచి శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. మూడవ రోజు బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు  శిక్షణ కార్యక్రమం నిర్వహించలేదు. కారణం అధికారులు కనిపించకపో వడంతో ప్రాజెక్టు పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఈ విషయంపై ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారిణి రాజేశ్వరిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉందని, కార్యకర్తలు నెమ్మెదిగా రావడం వలన శిక్షణ ఆలస్యంగా ప్రారంభించామని తెలిపారు.

Updated Date - 2021-01-21T05:11:34+05:30 IST