ప్రత్యేక రైళ్లు పొడిగింపు

ABN , First Publish Date - 2020-12-01T06:16:44+05:30 IST

ప్రయాణికులు సౌకర్యార్ధం ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

ప్రత్యేక రైళ్లు పొడిగింపు

విశాఖపట్నం, నవంబరు 30: ప్రయాణికులు సౌకర్యార్ధం ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. భువనేశ్వర్‌-తిరుపతి-భువనేశ్వర్‌(08479/08480) ఎక్స్‌ప్రెస్‌లను డిసెంబరు 27 వరకు, భువనేశ్వర్‌-చెన్నై-భువనేశ్వర్‌ (02839/02840) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జనవరి ఒకటి వరకు, భువనేశ్వర్‌-బెంగళూరు-భువనేశ్వర్‌ (02845/02846) ఎక్స్‌ప్రెస్‌లను డిసెంబరు 29 వరకు, భువనేశ్వర్‌-పాండిచ్ఛేరి-భువనేశ్వర్‌(02898/02897) రైళ్లను డిసెంబరు 30 వరకు, భువనేశ్వర్‌-రామేశ్వరం-భువనేశ్వర్‌(08496/08495) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను డిసెంబరు 27 వరకు, పూరి-చెన్నై-పూరి(02859/02860) సర్వీసులను డిసెంబరు 28 వరకు, విశాఖ-నిజాముద్దీన్‌-విశాఖ బై వీక్లీ(02851/02852) రైలును డిసెంబరు 30 వరకు, వారానికి ఐదు రోజులు నడుస్తున్న విశాఖ-నిజాముద్దీన్‌(02887/02888) రైళ్లను జనవరి రెండవ తేదీ వరకు, విశాఖ-చెన్నై-విశాఖ (02869/02870) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను డిసెంబరు 29వ తేదీ వరకు, విశాఖ-ఎల్‌టీటీ-విశాఖ(02857/02858) ఎక్స్‌ప్రెస్‌లను డిసెంబరు 29 వరకు, విశాఖ-గాంధీథాం-విశాఖ(08501/08502) రైళ్లను జనవరి మూడో తేదీ వరకు, విశాఖ-కడప-విశాఖ(07488/07487) రైళ్లను జనవరి ఒకటి వరకు పొడిగించారు.


విశాఖ, విజయవాడ మధ్య ప్రత్యేక రైలు

రత్నాచల్‌ వేళల్లో అందుబాటు

విశాఖపట్నం, నవంబరు 30: విశాఖ, విజయవాడ మధ్య నడిచే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం నుంచి ప్రత్యేక రైలుగా అందుబాటులోకి రానుంది. 02718 నంబరు గల ప్రత్యేక రైలు ప్రతిరోజు ఉదయం 6:15 గంటలకు విజయవాడలో బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 12:15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 02717 నంబరుతో మధ్యాహ్నం 12:55 గంటలకు విశాఖలో బయలుదేరి అదేరోజు రాత్రి 7:00 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ సర్వీసులు నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తుని మీదుగా రాకపోకలు సాగిస్తాయి. 


Updated Date - 2020-12-01T06:16:44+05:30 IST