ఏపీలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ABN , First Publish Date - 2021-04-14T22:44:22+05:30 IST

రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎన్‌ఎస్‌ఈటీ

ఏపీలో పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో  పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎన్‌ఎస్‌ఈటీ సీఈవో‌గా పని చేస్తున్న సి.హరిప్రసాద్‌ను కర్నూలు ఆర్డీవోగా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్  బి. చంద్రలీలకు నెల్లూరు ఎఫ్ఎస్ఓగా బాధ్యతలు అప్పగించారు.  పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్ అద్దయ్యకు ఏలూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్ పి. ఉమాదేవిని ప్రకాశం జిల్లాలో ఎఫ్ఎస్ఓగా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.లక్ష్మణ మూర్తికి విజయనగరం జిల్లా ఎఫ్ఎస్ఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Updated Date - 2021-04-14T22:44:22+05:30 IST