ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

ABN , First Publish Date - 2021-08-16T23:26:40+05:30 IST

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు.

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు.  ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. పరిశ్రమలశాఖ (ఫుడ్ ప్రాసెసింగ్) కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా, గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా ఆర్పీ సిసోడియాని బదిలీ చేసింది. స్టేట్ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా రవిశంకర్‌ నారాయణ్‌,  ఐఏఎస్‌ పీయూష్ కుమార్ జీఏడీకి బదిలీ చేస్తు ఉత్తర్వులు ఇచ్చింది. సీసీఎస్‌ఏ అప్పీల్స్ కమిషనర్‌గా లక్ష్మీనరసింహంకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. 

Updated Date - 2021-08-16T23:26:40+05:30 IST