ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
ABN , First Publish Date - 2021-07-02T02:51:45+05:30 IST
రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఎంసీ జోనల్ కమిషనర్ పి.సింహచలంను పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా ఉన్న కె.కనకమహలక్ష్మిని జీవీఎంసీ జోనల్ కమీషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.