పిల్లాడి ట్వీట్‌కు అధికారుల రిప్లై.. నెటిజన్లు ఫిదా!

ABN , First Publish Date - 2021-01-10T03:11:39+05:30 IST

ఒక పిల్లాడు చేసిన ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. వెంటనే స్పందించి అతని సమస్యను తీర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు చెందిన సాయి అనే పిల్లాడు తన సమస్యను రాజధాని ప్రాంత అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

పిల్లాడి ట్వీట్‌కు అధికారుల రిప్లై.. నెటిజన్లు ఫిదా!

భువనేశ్వర్: ఒక పిల్లాడు చేసిన ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. వెంటనే స్పందించి అతని సమస్యను తీర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు చెందిన సాయి అనే పిల్లాడు తన సమస్యను రాజధాని ప్రాంత అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ‘‘స్కూల్లో నా రిపోర్టింగ్ టైం ఉదయం 7.30గంటలు. కానీ మా ఏరియాలో తొలి బస్సు మొదలయ్యేది 7.40గంటలకు. దీంతో రోజూ లేట్ అవుతున్నా’’ అంటూ సాయి ఓ ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ భువనేశ్వర్ ఎండీ అరుణ్ బోత్రా స్పందించారు. ‘‘ఇక నుంచి ఈ ప్రాంతంలో తొలి బస్సు ఉదయం 7గంటలకే మొదలవుతుంది. ఇకపై స్కూలుకు లేట్ అవ్వవు’’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ సమాధానానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. బోత్రా, ట్రాన్స్‌పోర్ట్ విభాగంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



Updated Date - 2021-01-10T03:11:39+05:30 IST