తునిలో ఖజానా జువెలర్స్ షోరూమ్
ABN , First Publish Date - 2020-12-04T06:20:38+05:30 IST
ఖజానా జువెలర్స్.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా.. తునిలో కొత్త షోరూమ్ను ప్రారంభించింది. కొత్త షోరూమ్తో దేశవ్యాప్తంగా షోరూమ్ల సంఖ్య 50కి చేరుకుందని ఖజా నా జువెలర్స్ వెల్లడించింది.
తుని: ఖజానా జువెలర్స్.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా.. తునిలో కొత్త షోరూమ్ను ప్రారంభించింది. కొత్త షోరూమ్తో దేశవ్యాప్తంగా షోరూమ్ల సంఖ్య 50కి చేరుకుందని ఖజా నా జువెలర్స్ వెల్లడించింది. తుని షోరూమ్లో బంగారు, వెండి ఆభరణాలకు సంబంధించి సంప్రదాయ, మోడర్న్ డిజైన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ప్రారంభోత్సవ ఆఫర్లో భాగం గా బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు రూ.200, ప్రతి క్యారట్ డైమండ్స్పై రూ.10,000 వరకు పరిమిత కాలంపాటు రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. అతి తక్కువ మేకింగ్ చార్జీలను ఖజానా మాత్రమే ఆఫర్ చేస్తోందని తెలిపింది.