గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పండుకు చికిత్స
ABN , First Publish Date - 2020-06-05T20:30:38+05:30 IST
విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సందీప్ హత్య కేసు నిందితుడు మణికంఠ అలియాస్ పండుకు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. దీంతో అక్కడ పోలీసులు నిఘా పెంచారు. మరోవైపు ఈ కేసులో రెండు కుటుంబాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. సందీప్ను పక్కా పథకం ప్రకారమే హత్య చేశారని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పండు కుటుంబం ఖండిస్తోంది.
పండు ఎంబీఏ చదువుకున్నాడని, గంజాయి బ్యాచ్లతో ఎలాంటి సంబంధం లేదని అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పండుది నేరాలు చేసే వ్యక్తిత్వం కాదని అన్నారు. సందీప్పై దాడి సమయంలో పండు చేతిలో ఆయుధాలు కూడా లేవని చెప్పారు.