జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-12-06T23:02:58+05:30 IST

ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో

జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోరింది. సాక్ష్యాలను జగన్ తారుమారు చేసే అవకాశముందని సీబీఐ వాదించింది. సాక్షులను ప్రభావితం చేస్తారనే ఉద్దశంతోనే గతంలో హాజరు మినహాయింపునకు హైకోర్టు నిరాకరించిందని సీబీఐ పేర్కొంది. జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. పదేళ్లైనా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని సీబీఐ తెలిపింది. హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని సీబీఐ పేర్కొంది. జగన్ హాజరు మినహాయింపు పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. 




Updated Date - 2021-12-06T23:02:58+05:30 IST