ఆదివాసీ సంస్కృతిని కాపాడాలి
ABN , First Publish Date - 2021-03-02T05:01:59+05:30 IST
ఆదివాసీ సంస్కృతిని కాపాడాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు.
-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి
జైనూరు, మార్చి1: ఆదివాసీ సంస్కృతిని కాపాడాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని పార గ్రామంలో సోమవారం హీర సుఖ జయంతిని ఆదివాసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచేచ ఏడాది హీర సుఖ జయంతిని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హీర సుఖ జయంతి నిర్వహణకు ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార గ్రామంలో ఆంజనేయ స్వామి మందిర నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు జడ్పీ చైర్పర్సన్కు గ్రామస్థులు డప్పులు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కుంర తిరుమల విశ్వనాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు ఇంతీయాజ్ లాల తదితరులు ఉన్నారు.