గిరిజన దండోరాను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-08-03T04:20:31+05:30 IST
ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 9న నిర్వహించే గిరిజన దండోరాను విజయవంతం చేయాలని కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు అనిల్గౌడ్ కోరారు.
తిర్యాణి, ఆగస్టు 2: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 9న నిర్వహించే గిరిజన దండోరాను విజయవంతం చేయాలని కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు అనిల్గౌడ్ కోరారు. సోమ వారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన దండోరా కార్యక్రమానికి కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. వెంకన్న, సాగర్, శంకర్, లచ్చాగౌడ్, కొమురయ్య, కిరణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి: దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు కె విశ్వప్రసాద్రావు అన్నారు. సోమవారం కెరమెరి మండలంలో మాట్లాడుతూ దండోరా సభకు మండలం నుంచి రెండువేల మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.