గిరిజన సమస్యలపై ప్రజాసంఘాల ఆందోళన
ABN , First Publish Date - 2020-09-22T05:43:37+05:30 IST
మన్యంలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని సీపీఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం
ఇల్లెందురూరల్, సెప్టెంబరు 21: మన్యంలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించాలని సీపీఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం గిరిజన సంఘం నాయకులు మూడు శోభన్, వజ్జా సురేశ్ మాట్లాడారు. ప్రభుత్వం గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా నిర్బంధం విధిస్తోందని, డీఎస్సీని ప్రకటించకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. జీవో3కి చట్టబద్ధత కల్పించాలని అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తు ఈనెల29న తెలుగు రాష్ర్టాల్లో మన్యం బంద్కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పినబోయిన వెంకటేశ్వర్లు, మల్లయ్య, వీరస్వామి, రాందాస్, గురవమ్మ, పగడమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అబ్దుల్నబీ, ఆలేటికిరణ్, తాళ్లురి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.