గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి
ABN , First Publish Date - 2020-08-10T11:02:34+05:30 IST
గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయా లని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుర్ర శంకర్నాయక్ కోరారు.
హాలియా, ఆగస్టు 9: గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయా లని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుర్ర శంకర్నాయక్ కోరారు. ఆదివాసుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థాని కంగా జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య, ఆకారపు నరేష్, నరేష్, శ్రీరామ్, రవీందర్, కుమార్, మత్రు పాల్గొన్నారు. గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రమావత్ దినేష్నాయక్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆంగోతు భగవాన్నాయక్, రవికుమార్, నగేందర్నాయక్ తదితరులు ఉన్నారు.